శీఘ్రస్ఖలనం ఇక సమస్యే కాదు....!



పురుషుడి జీవితాన్ని అమితంగా కుదిపేసే అతి పెద్ద భయాల్లో శీఘ్రస్ఖలనం ఒకటి. పురుషుల్లో అత్యధికులు ఎదుర్కొనే అతి పెద్ద సమస్య కూడా ఇదే. అల్లోపతి వైద్యం శీఘ్రస్ఖలన సమస్యకు మూలం మెదడులోనే ఉందని, మానసిక ఒత్తిళ్లే అతి పెద్ద కారణమని అదేపనిగా చెబుతూ ఉంటుంది. కాని, అది నిజం కాదు. శీఘ్రస్ఖలన సమస్య కారణాల్లో మెదడు కూడా ఒక భాగమే. దానికి మించి హార్మోన్ సమస్యలు అతి పెద్ద కారణంగా ఉంటాయి. వాటితో పాటు కండరాలు, నరాలు, రక్తనాళాలు వీటన్నింటి భూమిక కీలకంగానే ఉంటుంది. వీటన్నింటితో పాటు ఇటీవల జరిపిన పరిశోధనల్లో శీఘ్రస్ఖలన సమస్యకు నాడీవ్యవస్థలో అంతటా ఉండే సెరటొనిన్ పరిమాణం తగ్గడం ఒక ప్రధాన కారణమని తేలింది. ఈ వాస్తవాల్ని విస్మరించి చాలామంది శీఘ్రస్ఖలన సమస్యకు మానసిక ఒత్తిళ్లే కారణమని చెబుతూ వస్తున్నారు.

ఆయుర్వేదం.. ఓ అద్భుతం...!
అల్లోపతిలో శీఘ్రస్ఖలనం అన్నది ఎప్పటికీ తొలగిపోని శాశ్వత వ్యాధి. ఆయుర్వేదంలో అది సంపూర్ణంగా తొలగిపోయే సమస్య. మౌలికంగా శీఘ్రస్ఖలనం అన్నది వాత వికతి వల్ల తలెత్తే సమస్య. ఒకసారి వాతం ప్రకోపిస్తే అది పిత్తాన్ని, కఫాన్ని పెంచేస్తుంది. పిత్తం పెరిగితే లైంగిక వ్యవస్థ బలహీనపడుతుంది. లైంగిక సామర్థ్యం తగ్గిపోతుంది. అంగస్తంభనలు తగ్గిపోతాయి. అందువల్ల లైంగిక శక్తి బలంగా ఉండాలంటే వాత, పిత్త, ఫాలు మూడూ సమతులంగా ఉండాలి. ఆ లక్ష్యంగానే ఆయుర్వేదం పనిచేస్తుంది. ఆయుర్వేదం శీఘ్రస్ఖలనాన్ని అరికట్టగల శక్తినిస్తుంది. శంగారంలో లోతైన ఆనందానికి పాత్రుల్ని చేస్తుంది. ఆయుర్వేదంలో అష్టాంగాలు అంటూ ఒక ఎనిమిది విభాగాలున్నాయి. వాటిలో లైంగిక విషయాలకే ప్రత్యేకించి వాజీకరణ తంత్రం ఉంది. ఇది సమస్త లైంగిక సమస్యలకు నివారణా మార్గాలను సూచించడంతో పాటు సంతానలేమి సమస్యను కూడా పరిష్కరిస్తుంది.

శాశ్వత పరిష్కారంగా......!
శీఘ్రస్ఖలన సమస్య నివారణకు ఆయుర్వేదంలో వాతహర చికిత్సలు చేస్తారు. వాతపిత్తకఫాలు సామ్యావస్థకు చేరుకునే వైద్యం చేస్తారు. ఆపైన వాజీకరణ చికిత్సలు చేస్తారు. ఇందులో వీర్యకణాల సంఖ్యను పెంచే విధానం కూడా ఉంటుంది. వీటితో పాటు లైంగిక పటిమను పెంచేవి, మానసిక సమస్యలను తొలగించేవి, శుక్రాన్ని శక్తివంతం చేసేవి ఇలా పలు రకాల ఔషధాలు ఆయుర్వేదంలో ఉన్నాయి. వాతపిత్తకఫాలు సామ్యావస్థకు చేరుకున్నప్పుడు సప్తధాతువులూ వద్ధిచెందుతాయి. వైద్య చికిత్సలతో శుక్రంలో పుష్టి ఏర్పడితే శంగారంలో పరిపూర్ణ ఆనందాన్ని పొందే స్థితి ఏర్పడుతుంది. సంతానప్రాప్తి కూడా కలుగుతుంది. ఆయుర్వేద చికిత్సలతో సప్తధాతువుల్లోని చివరిదైన శుక్రం పరిపుష్టం కావడమే కాకుందా, ప్రాణవంతమైన ఓజస్సు కూడా వద్ధి చెందుతుంది. అయితే వాజీకరణాలు గాని, రసాయనాలు గాని తీసుకునే ముందు శరీరంలోని అమాన్ని అంటే వ్యర్థ, విషపదార్థాలను సంపూర్ణంగా తొలగించుకోవాలి. అందుకు పంచకర్మ చికిత్సలు చేయించుకోవాలి. వీటిన్నింటి ద్వారా మొత్తంగా సర్వశక్తివంతంగా మారి, అవి తమ సహజశైలిలో పనిచేయడం మొదలెడతాయి. ఫలితంగా శీఘ్రస్ఖలన సమస్యకు ఇక ఎంతమాత్రం తావుండదు.

- డాక్టర్ వర్ధన్
ది కేరళ ఆయుర్వేదిక్ కేర్, స్పెషాలిటీ, పంచకర్మ సెంటర్, హైదరాబాద్,

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | GreenGeeks Review